- గత విధ్వంస పాలనలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి
- గూగుల్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎంపీతో కేసులు వేయించారు
- మాది గూగుల్… వారిది గొడ్డలి… బోత్ ఆర్ నాట్ సేమ్
- గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనలో మంత్రి లోకేష్
విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖపట్నం అంటే మనకి స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది. బీచ్ గుర్తొస్తుంది. కానీ ఇకనుండి విశాఖపట్నం ఊసెత్తితే ఏఐ డేటా హబ్… గ్లోబల్ ఐటీ హబ్ గుర్తుకొస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ సమీపాన తర్లువాడవద్ద ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గూగుల్ ఏఐ హబ్తో విశాఖ ముఖచిత్రం మారబోతోంది. ఇది ఒక భూమిపూజ కాదు… భవిష్యత్తుకి పునాది. ఇది ప్రాజెక్ట్ కాదు ఒక జనరేషన్ని మార్చే మూవ్మెంట్. ఆంధ్రప్రదేశ్ రైజింగ్ -ఇండియా లీడింగ్ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. కేంద్ర మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ భారతదేశ డిజిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవాన్ని అసాధారణ వేగం, స్పష్టతతో నడిపిన డైనమిక్ లీడర్ అని కొనియాడారు. ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పట్టాలెక్కించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గూగుల్, అదానీ గ్రూప్, భారతి ఎయిర్టెల్ సంస్థ లీడర్లు, భారత ప్రభుత్వ అధికారులు, ప్రతిష్ఠాత్మక ఇండస్ట్రీ పార్టనర్లు, విశాఖ యువత, ఉత్తరాంధ్ర ప్రజలకు, గూగుల్ కోసం భూములిచ్చిన రైతులకు మంత్రి అభినందనలు తెలిపారు.
ఈరోజు సరికొత్త చరిత్రకు పునాది
“28 ఏప్రిల్ 2026… సరికొత్త చరిత్రకు పునాది. ఈ తేదీ రాసి పెట్టుకోండి. విశాఖపట్నం పేరు ఇకపై ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇకనుంచి ఒక లెక్క. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ సిటీ… ఇక నుండి విశాఖ ఏఐ డేటా హబ్. ఇప్పటి వరకు గూగుల్లో విశాఖపట్నం గురించి సెర్చ్ చేశారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖపట్నం ఉంటుంది. వైజాగ్లో ‘జి’ అంటే గూగుల్ అని గట్టిగా చెప్పాలి. వైజాగ్లో సౌండ్ చేస్తే దేశం మొత్తం వినిపించాలి. గూగుల్ రాకుండా అడ్డుకోవడానికి కేసులు వేసిన బ్యాచ్కి వినిపించాలి” అంటూ పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు.
ఐదేళ్లపాటు రాష్ట్రంలో విధ్వంస పాలన
రాష్ట్రంలో ఐదేళ్లపాటు విధ్వంస పాలన జరిగింది. ఒక్క కంపెనీ రాలేదు. ఉన్న కంపెనీలను తరిమేశారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. 2024లో ఒక ప్రభంజనం వచ్చింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర… స్టేట్ మొత్తం క్లీన్ స్వీప్. 94శాతం స్ట్రైక్ రేట్తో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజు నుంచే పెట్టుబడుల కోసం పరిగెత్తాం. అన్ని దేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేశాం” అని గర్వంగా ప్రకటించారు.
సీబీఎన్ బ్రాండ్తోనే ఇన్వెస్టర్ల రాక
అప్పుడు ఇన్వెస్టర్లు అడిగిన మాట మేము ఆంధ్రప్రదేశ్కు ఎందుకు రావాలి? అని. ఆంధ్రప్రదేశ్కి ఉన్న మూడు యూనీక్ పాయింట్ల గురించి వాళ్లకు చెప్పాను. మొదటిది బ్రాండ్ సీబీఎన్. ప్రపంచంలో ఏ కంపెనీ వద్దకు వెళ్లినా మన బ్రాండ్ సీబీఎన్ పేరు చెప్పగానే డోర్స్ ఓపెన్ అవుతాయి. సైబరాబాద్ కట్టిన హిస్టరీ మన బ్రాండ్కి ఉంది. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి గేర్ మార్చాం. మూడవది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార” అని లోకేష్ పేర్కొన్నారు.
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్
చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఆ బుల్లెట్ ట్రైన్ పేరు నమో. అంటే నాయుడు -మోదీ. అందుకే మనకి గూగుల్ వచ్చింది. దేశానికి 100 రూపాయల పెట్టుబడి వస్తే ఒక్క ఏపీకి 25 రూపాయల పెట్టుబడి వచ్చింది. అదీ సీబీఎన్ బ్రాండ్ సత్తా” అని వివరించారు.
అధికారంలోకి వచ్చిన రెండోనెల నుంచే గూగుల్ కోసం వేట
“ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతి కంపెనీ వెనుక ఒక కథ ఉంది. తీసుకొచ్చిన ప్రతి కంపెనీ వెనుక కష్టం ఉంది. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టు వచ్చింది. గూగుల్ స్టోరీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే గూగుల్ ప్రతినిధులతో ఇదే విశాఖపట్నంలో మొదటి మీటింగ్ జరిగింది. ఆరోజు జరిగిన మీటింగ్ ఫలితం ఈ రోజు ఒక డేటా సిటీ. ఆ రోజు వాళ్లు ఒక క్లియర్ విజన్తో వచ్చారు. మూడు అంశాల్లో క్లారిటీ కావాలని అడిగారు. ఆరోజు వాళ్లు అడిగిన మూడు అంశాలను మనం ఒక మిషన్ మోడ్లో తీసుకున్నాం. 13 నెలలు పరుగులు పెట్టాం. వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ప్రతి రోజు ఫాలో అప్ చేశాం” అని లోకేష్ వివరించారు.
సీఎం నేరుగా పర్యవేక్షించారు..
“విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ సహకరించారు. ముఖ్యమంత్రి నేరుగా మానిటర్ చేశారు. పాలసీలో మార్పులు కావాలంటే కేంద్రాన్ని ఒప్పించి చేయించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇందుకు సహకరించారు. 13 నెలల కష్టం తరువాత అక్టోబర్ 2025న ఢిల్లీలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాం. సీఎం 12నెలల టార్గెట్ ఇస్తే 13 నెలల్లో పూర్తి చేశాం. ఆయనను సంతృప్తి పరచాలంటే మేము ఇంకా స్పీడ్ పెంచాలి. ఆయన 25 ఏళ్లు కుర్రాడిలా పరిగెడతారు. మేము అయన వెనుక పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాం” అన్నారు.
గూగుల్ డేటా సెంటర్ కాదు… ఏఐ మెగా హబ్
విశాఖలో గూగుల్ 1.35 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. గూగుల్ ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటర్ కాదు, ఇది ఏఐ మెగా హబ్. 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఈ డేటా సెంటర్ రాబోతుంది. 2028కి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కంపెనీ నిర్మాణంలో ఉన్నప్పుడే 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కంపెనీ ఏర్పాటు పూర్తయ్యాక, గూగుల్ హబ్తో పాటు ఇతర అనుబంధ కంపెనీలతో కలిపి డైరెక్ట్ & ఇన్డైరెక్ట్ గా 2లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ & మెకానికల్ సిస్టమ్స్ ఇలా అనేక రంగాల్లో హై క్వాలిటీ జాబ్స్ వస్తాయి.
ట్రిలియన్ డాలర్ ఎకనమిక్ రీజియన్గా విశాఖ
గూగుల్ మెగా డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజిన్ కాబోతుంది. విశాఖ రీజియన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రూపుదిద్దుకోనుంది. డిసెంబర్ 2025న నేను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గారిని కలిశాను. ఆయన ఆరోజు అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్, పాలసీ క్లారిటీ, కమిట్మెంట్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఆయన మాటలు విన్న తర్వాత నాకు మరింత బలం వచ్చింది. ఇతర రాష్ట్రాలతో కాదు ఇతర దేశాలతో పోటీ పడే స్థాయి మనకు ఉంది.
మా విజన్ అభివృద్ధి వికేంద్రీకరణ
ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. ప్రజా ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉంది. విశాఖపట్నం ఎకనామిక్ జోన్, అమరావతి ఎకనామిక్ జోన్, తిరుపతి ఎకనామిక్ జోన్ మా విజన్. క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ చేస్తున్నాం. రాయలసీమ -ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, కోస్తా, సీబీజీ ప్లాంట్స్, ఆక్వా, క్వాంటం. ఉత్తరాంధ్ర -ఫార్మా, ఐటీ, డేటా సెంటర్స్. అన్ని ప్రాంతాల అభివృద్ధి మా బాధ్యత. 20లక్షల ఉద్యోగాలు కల్పించడం మా సింగిల్ పాయింట్ ఏజెండా” అని లోకేష్ పేర్కొన్నారు.
మనది గూగుల్… వారిది గొడ్డలి
లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్ వేరు అని పవనన్న డైలాగ్ ఉంది. మనది గూగుల్… వాళ్లది గొడ్డలి. గూగుల్ వస్తే ఎవరైనా అహ్వానించాలి. కానీ గొడ్డలి పార్టీ ఏమి చేసింది. రాయలసీమలో ఉన్న వైసీపీ ఎంపీ గూగుల్ వద్దని పిల్ వేస్తారు. వాళ్లకి తీసుకురావడం చేత కాదు… వేరేవాళ్లు తెస్తే ఏడుపులు. ఈరోజు భూమి పూజ అయ్యింది. రేపు సీసీడీ పేషెంట్ వచ్చి నేనే గూగుల్ తెచ్చాను అంటారు. గూగుల్ సెర్చ్లో గూగుల్ ఎవరు తెచ్చారని అడిగితే నారా చంద్రబాబునాయుడు అని వస్తుంది. నేను చెప్పేది ఒక్కటే.. మాది గూగుల్… మీది గొడ్డలి. బోత్ ఆర్ నాట్ సేమ” అని లోకేష్ చమత్కరించారు.
గూగుల్కి ధన్యవాదాలు
భారత్, ఆంధ్రప్రదేశ్పై నమ్మకంతో వచ్చిన గూగుల్ సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఎనేబుల్ చేయడంలో కీలకపాత్ర వహించిన అదానీ గ్రూప్కి, భారతీ ఎయిర్టెల్కి అభినందనలు. మా గ్రోత్ స్టోరీలో స్ట్రాంగ్ పార్ట్నర్గా ఉన్నందుకు విశాఖపట్నం ప్రజలకు కృతజ్ఞతలు. మీ సపోర్ట్, బిలీఫ్, స్పిరిట్ లేకుండా ఇది సాధ్యం కాదు. ఈ ప్రాజెక్ట్ కోసం భూములిచ్చిన రైతులకు నమస్సుమాంజలి. మీ త్యాగం, నమ్మకం ఈ చారిత్రాత్మక ట్రాన్స్ఫర్మేషన్కి నిజమైన ఫౌండేషన్ అని మంత్రి లోకేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇతర కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, కే.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, గూగుల్ క్లౌడ్, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే, భారతి ఎంటర్ప్రైజెస్ వైస్ ఛైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ ఛైర్మన్ జీత్ అదానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ ప్రీతి లొబానా, అదానీ గ్రూప్ డైరెక్టర్ కరణ్ అదానీ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.















