- పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలి
- వాటర్ ఫ్రంట్ నగరంగా రూపుదిద్దుకుంటోంది
- అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుంది
- అందుకు సైబరాబాద్ నిర్మాణమే నిదర్శనం
- వరల్డ్ సిటీస్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు
- సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
- ఇన్నోవేటర్స్ అలే, గూగుల్ స్టాల్ సందర్శన
సింగపూర్: అంతర్జాతీయ మౌలికవసతులతో నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సరికొత్త ఆలోచనలతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులను ఆహ్వానించారు. సింగపూర్లో రెండవ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్ షిప్ ప్లీనరీ-2లో పాల్గొని ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స’ అనే అంశంపై ప్రసంగించారు. అమరావతిని నాలెడ్జ్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని, జాతీయ`అంతర్జాతీయ విద్యాసంస్థ లు వస్తున్నాయని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ హబ్, డిజిట ల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి అమరావతికి ప్రత్యేకత తీసుకు వస్తాయని వివరించారు. అమరావతి ప్రజా రాజధానిగా, ప్రపం చంలోనే అత్యుత్తమ నగరంగా నిర్మితమవుతోందని స్పష్టం చేశా రు. ఈక్విటీ, నేచర్, ఆపర్చ్యునిటీ, లివబుల్ సిటీగా అమరావతి ఉంటుందని తెలిపారు.
21 కి.మీ కృష్ణానది పొడవునా వాటర్ ఫ్రంట్ నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని, ఇన్నర్ – ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలతో అద్భుతంగా నిలుస్తుందని చెప్పారు. స్పోర్ట్స్, ఫైనాన్సియల్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడియా వంటి థీమ్లతో అమరావతిని నిర్మిస్తున్నామని వివరిం చారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో లక్ష్యంగా రాజధాని నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధం గా ఒకే ఒక్క పిలుపుతో రాజధాని నిర్మాణం కోసం రైతులు 35 వేల ఎకరాలను అప్పగిస్తే వాటిని అభివృద్ధి చేసి కొంత భాగాన్ని రైతులకు తిరిగి ప్లాట్లుగా ఇచ్చామని వివరించారు. 25 ఏళ్ల క్రితం తాను ఐటీ గురించి మాట్లాడానని.. ఐటీ భవిష్యత్ను ఆ రోజే ఊహించి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవడంతో ఇవాళ తెలుగువాళ్లు తలసరి ఆదాయంలో అందరికన్నా ముందున్నారని పేర్కొన్నారు.
నాటి సైబరాబాద్ నేడు ఆదాయ వనరు
ఇప్పుడు ఏఐ గురించి ఆలోచన చేస్తున్నాం. నాడు తాను నిర్మించిన సైబరాబాద్ నేడు తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. సైబరాబాద్లో నాడు ఎకరం రూ.2 లక్షలు ఉంటే నేడు ఎకరం రూ.200 కోట్లకు పెరిగింది. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుందని చెప్పేందుకు సైబరాబా ద్ నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో మరోసారి కొత్త నగరాన్ని నిర్మించే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. ప్రసంగం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సింగపూర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్రదర్శన స్టాల్స్ను సందర్శిం చారు. సింగపూర్ పెవిలియన్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పట్టణాభివృద్ధి నమూనాలను సీఎం ఆసక్తిగా తిలకించారు. ఇన్నోవేటర్స్ అలేలో స్టార్టప్ల ఆవిష్కరణలను, గూగుల్ స్టాల్ను పరిశీలించారు. టెక్నాలజీ ఆధారిత పాలనలో సింగపూర్ అనుభవాలను తెలుసుకున్నారు.
















