- అబద్ధాల ప్రచారంతో మోసగించింది
- అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మార్గం
- రికార్డు స్థాయికి దూసుకెళుతున్న వ్యవసాయం
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి(చైతన్యరథం): వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరి గారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలిచి గిట్టుబా టు ధరలు, సమయానికి విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల సదుపాయాలు అందిస్తూ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం వాస్తవాలను వక్రీకరించి అబద్ధాల ప్రచా రం చేయడం దురదృష్టకరమన్నారు. వైసీపీ పాలనలో రైతులు అప్పుల భారంతో నలిగిపోవడం, పంటలకు సరైన ధరలు దక్కక రోడ్డెక్కిన ఘటనలు ప్రజలు మర్చిపోలేదని, ఆ కాలంలో వ్యవ సాయం క్షీణించి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని విమర్శిం చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీSP అమలులో కట్టుబడి ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటూ 2025–26లో రూ.300 కోట్ల కేటాయిస్తే సుమారు రూ.588 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అందులో పోగాకు (రూ.240 కోట్లు), మామిడి (రూ.190 కోట్లు), ఉల్లి కొనుగోలు (రూ. 17.20 కోట్లు), ఉల్లి నష్టపరిహారం (రూ.128.33 కోట్లు), కోకో (రూ.12 కోట్లు) వంటి పంటలకు ప్రత్యక్ష మద్దతు అందించామని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయకుండా తప్పుడు లెక్కలు చూపించి రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. 25 వేలు ఉన్న ఉల్లి నష్టపరి హారాన్ని హెక్టారుకు రూ.50 వేల వరకు పెంచి రైతులకు ఉపశమనం కల్పించామని, ప్రస్తుతం మొక్కజొన్న సమస్యపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో నిరంతరం చర్చలు జరుపుతూ రైతులకు అనుకూల నిర్ణయం తీసుకురాబోతు న్నామని వెల్లడించారు.
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 51% వృద్ధి
2019-2024 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 143-175 లక్షల మెట్రిక్ టన్నుల మధ్యే నిలిచిపోయి 2023-24లో 143 లక్షల టన్నులకు పడిపోవడం వైసీపీ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తుంది. 2024 తర్వాత కూటమి పాలనలో 163 లక్షల టన్నుల నుంచి 2025-26లో 237 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగి సుమారు 51% వృద్ధి నమోదు కావడం వ్యవసాయ రంగంలో సంభవించిన మార్పుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఉద్యాన రంగంలో కూడా చరిత్రాత్మక పురోగతి సాధిస్తున్నామని పేర్కొంటూ, మైక్రో ఇరిగేషన్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 2014-19లో 6.58 లక్షల హెక్టార్ల తో పోలిస్తే వైసీపీ కాలంలో అమలు తగ్గిపోగా, కూటమి ప్రభు త్వం వచ్చాక వేగవంతం చేసి 2024-26 మధ్య లక్షల హెక్టార్ల లో డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాలు కల్పించామని తెలిపారు. గత ప్రభుత్వం వదిలిన బకాయిల్లో రూ.881 కోట్లు చెల్లించడంతో పాటు ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచుతూ, జీవీఏను రూ. 1.52 లక్షల కోట్లకు చేర్చామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని, ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందని, కొత్త విస్తరణ కు భారీ ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, ఆదాయం పెంపు, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధాలు ప్రచారం చేసే వైసీపీ నేతల మాటలను ప్రజలు తిప్పికొడతారని ఘాటుగా హెచ్చరించారు.















