- ఆర్టీఐహెచ్ ఆవిష్కరణలు, స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టండి
- ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లకు అనుకూలం
- క్వాంటమ్ టెక్నాలజీ సహా వివిధ రంగాల్లోనూ అవకాశాలు
- సింగపూర్ వెంచర్ క్యాపిటలిస్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు
- ప్రాజెక్టులతో ఏపీ అభివద్ధిలో భాగస్వామి కావాలని పిలుపు
- రోబోటిక్స్, మెడికల్ డివైజెస్, హార్డ్వేర్ రంగాల్లో సహకారం
- విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం ఏర్పాటుకు కృషిచేయాలి
- భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతోనూ సమావేశం
సింగపూర్: సంస్కరణలతో దూసుకుపోతున్న ఆర్థిక శక్తి భారత్ అయితే..అందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదకశక్తిగా ఎదుగు తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చైనా వంటి దేశాలు ఆర్థికవృద్ధికి దశాబ్దాల కాలం పడితే భారత్కు అంత సమయం అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆధునిక ఆలోచనలు, సంస్కరణలతో భారత్ను అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలిరోజు సోమవారం వెంచర్ క్యాపిటలిస్టులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మెడికల్ టెక్నా లజీ సహా ఆధునిక పరికరాల తయారీలో భారత్ ఇప్పుడు అగ్రస్థా నంలో ఉందన్నారు. వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇప్పుడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయని వివరించారు. డెమో గ్రాఫిక్ డివిడెండ్తో అతిపెద్ద యువశక్తి ఉన్న మానవవనరుల దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. భారత్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోందని వివరించారు. ఆంధ్రప్రదే శ్లో 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు సహా వివిధ రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేసేలా ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. మెడికల్ టెక్నాలజీ, ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.
ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఆంధ్రప్రదేశ్లో వన్ ఫ్యామి లీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపా రు. ఏపీకి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలకు వేగంగా అనుమతులు, భూములు కేటాయించామని వివరించారు. ఏపీలో వివిధ పారిశ్రా మిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయం.. పెట్టుబడిదారులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. శ్రీసిటీ లాంటి ప్రత్యేక పారిశ్రామికవాడలు పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఏపీలో పౌరసేవలతో పాటు అన్ని అంశాలకూ టెక్నాలజీని అనుసంధానించామని వివరించా రు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఉందన్నారు. వెంచర్ క్యాపిటలిస్టులు ఆర్టీఐహెచ్ ప్రోత్సహించిన స్టార్టప్లకు పెట్టుబడులు అందించే అవకాశం ఉందన్నారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వెంచర్ కాపిటలి స్టులు ముందుకురావాలని కోరారు. ఈ సమావేశానికి ఆరిజన్ వెంచర్స్, ఆటోమోనిక్స్, ఏలెవ్ 8 వెంచర్స్, ఆప్టిమమ్ సొల్యూష న్స్, క్వోనా క్యాపిటల్, జంగిల్ వెంచర్స్ తదితర వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం
భారత హైకమిషనర్తో భేటీలో చంద్రబాబు
తొలిరోజు పర్యటనలో ముందుగా సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. భారత్లో సింగపూర్కు ఉన్న ఆర్థిక, వాణిజ్య ఒప్పందా లను ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని కోరా రు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఏపీలో కొత్తగా పోర్టులు అందుబాటు లోకి వస్తున్నందున షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్, మెయింటె నెన్స్, రిపేర్స్ ఓవర్ హాలింగ్ కేంద్రాలకు నెలకొల్పేందుకు అవకా శం ఉందని తెలిపారు. ఏపీలో హార్టికల్చర్ ఉత్పత్తుల ట్రేసింగ్, సర్టిఫికేషన్కు వెళుతున్నామని వివరించారు. రోబోటిక్స్, మెడికల్ డివైజెస్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సింగపూర్ సహకారం కోరుతున్నామని తెలిపారు. సింగపూర్-ఏపీ విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు. ఈ సమావేశా నికి మంత్రి పి.నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈవో షన్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు.












