- తెలుగుజాతి గుండెల్లో చిరస్మరణీయుడు
- దేశంలో ఆయనను మించిన నేత లేడు
- టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు
- మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానం
- మహిళలకు రిజర్వేషన్ మనమే ప్రారంభిద్దాం
- చట్టసభల్లో 33 శాతం కల్పించాలని
- కేంద్రాన్ని మరోమారు కోరతామని వెల్లడి
అమరావతి(చైతన్యరథం): తెలుగుజాతికి వెలుగై నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ప్రజలందరి డిమాండ్ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశరాజకీయాల్లో పెనుమార్పు లకు నాంది పలికిన మహోన్నత నాయకుడికి భారత రత్న ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ జయంతిని పురస్క రించుకుని గురువారం మహానాడు రెండో రోజున ఎన్టీఆర్కు నివాళి అర్పించే తీర్మానంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. తెలుగుజాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతం గా నిలిచిపోయారని కొనియాడారు. సామాన్య ప్రజల సంక్షేమానికి పెద్దపీటవేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. ప్రజల మనస్సుల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయ స్థానం సంపాదించారన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం పని చేసిన మహోన్నత నేత ఎన్టీఆర్ అని… భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టం… అపూర్వం అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మా నించింది.
ఎన్టీఆర్ ఖ్యాతి మరెవరికీ సాధ్యం కాదు
‘తెలుగు జాతి ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో శాశ్వతం గా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ జయంతి తెలుగు వారం దరికీ పండుగ రోజు. సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి సినీ జీవితంతో పాటు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎదిగారు. ఎన్టీఆర్ మళ్లీ పుడితే తప్ప ఆయన క్రమశిక్షణ, ఆయన ఖ్యాతి మరెవరికీ సాధ్యం కాదు. ఆయన ఎక్కడ ఉన్నా తెలుగువారి ఆత్మగౌరవం కోసమే జీవించారు. రైతుబిడ్డ నుంచి సినిమాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల వరకూ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టిం చారు.
ఎన్టీఆర్ పేరు తలుచుకుంటేనే పట్టుదల, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆయన పేరు తలచుకుని సంకల్పం చేస్తే చాలు దేనికీ తిరుగు ఉండదు. దేశ రాజకీయాల్లో ఆయన లాంటి నాయకుడు మరొకరు లేరు. ఆయన మొదట సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగంలో చేరి ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన
స్థాపించిన ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషిచిందని పేర్కొన్నారు.
రైతులు, మహిళలు, యువతకు దిక్చూచి ఎన్టీఆర్
ఎన్టీఆర్ పాలన రైతులకు అండ, మహిళలకు భరోసా, కార్మికులకు అభయం, యువతకు దిక్సూచి అయింది. సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు అనే నినాదాన్ని శాశ్వత విధానంగా ఎన్టీఆర్ మార్చారు. తెలుగుదేశం జెండా ఆడబిడ్డలకు అండ, రైతన్నలకు భరోసా, యువతకు విశ్వాసం. 1983లో రాజకీయాల్లో యువతకు ఎన్టీఆర్ అవకాశాలు కల్పించారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. భవిష్యత్లో పార్టీకి సమర్థ నాయకత్వం ఉండేలా భవిష్యత్ కార్యాచరణ చేపడుతున్నాం. జాతీయ కార్య ర్వాహక అధ్యక్షులు లోకేష్ మహానాడు తోలిరోజున ప్రతిపాదించిన 33 శాతం రిజర్వేషను మనమే ప్రారంభిద్దాం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్రాన్ని మరోమారు కోరతామని తెలిపారు.














