- ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి వర్తింపు
- ఇక హాస్టళ్ల స్థానంలో గురుకులాలనే నిర్మిద్దాం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు శిక్షణ కేంద్రాలు
- వసతిగృహాలు, రెసిడెన్షియల్ విద్యాలయాలకు రూ.100 కోట్లతో మెయింటెనెన్స్ గ్రాంట్
- దత్తత తీసుకునేలా ఎన్ఆర్ఆలను సంప్రదించాలి
- పూర్వ విద్యార్థుల నెట్ వర్కింగ్ ఏర్పాటు చేయాలి
- పేదల జీవనోపాధికి పీ4 అనుసంధానం
- అన్ని వైపుల నుంచి ఆదాయం సమకూరాలి
- సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం సంక్షేమ శాఖలపై జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని సీఎం స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుంది.. దీనికి తగినట్టుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది.. ఈ మేరకే డైట్ ఛార్జీలు పెంచు తున్నామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లబ్ది చేకూర్చే విషయంలో వారికి కలిగే ప్రయోజనాన్ని పరిగణన లోకి తీసుకోవాలని సూచించారు.
మెరుగైన వసతులతో గురుకులాలు
సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పెద్దఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశిం చారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేటు ధీటుగా తీర్చిదిద్దాల ని తెలిపారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందు కు పెద్దపీట వేయాలని సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో నెట్జ్బరో విధానాన్ని అమలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగా లు ఉన్నాయో విశ్లేషించాలి. బయో డైవర్శిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలి. మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలతో గురుకులాలను నిర్మిద్దాం.. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వాలి. దీని నిమిత్తం రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా చర్య లు తీసుకోవాలి, ఐఐటీ, ఎన్బటీ, సీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇప్పించాలి. పోటీ పరీక్షలకు గురుకు లాల్లో చదువుతున్న విద్యార్థులను సిద్ధం చేయాలి.
విద్యతో సమా నంగా శిక్షణ అందించాలి. బెస్ట్ టీచర్లను నియమించి ఉత్తమ శిక్షణ ఇవ్వాలి. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనబరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను మ్యాపింగ్ చేసి నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు వర్ఫోర్స్ సిద్ధం చేయాలి. హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠ శాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఓ. వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టళ్లను ఎస్ఆర్బలు దత్తత తీసుకునేలా వారితో సంప్రదింపులు జరపాలి, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాల ల్లో పూర్వ విద్యార్థుల నెట్ వర్కింగ్ చేయాలి. రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి విద్య, వైద్య సేవలు అందించే వారికి అవకాశం కల్పించాలని సూచించారు.
పేదలకు పథకాల లబ్ది చేకూరాలి
పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమం అందించడమే కాదు.. వారి జీవనోపాధిని మెరుగుపరిచి ఆదాయం సమకూర్చేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వం వైపు నుంచి అందించే సంక్షేమం, మెప్మా, డ్వాక్రా పథకాల ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు పీ4 ద్వారా సాయం అందాలి. వ్యవసాయం, ఉద్యాన రంగం, పాడి పరిశ్రమ, జీ రామ్ జీ సహా వివిధ సంక్షేమ పథకా ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేకూర్చాలి. సాస్కీ పూర్వోదయ, జీ రామ్ జీ వంటి పథకాల లబ్ధి బడుగు వర్గాలకు దక్కేలా చూడాలి. ఉద్యాన, రబ్బర్, కాఫీ, పసుపు వంటి పంటల సాగును ప్రోత్సహించి ఆ వర్గాల రైతులకు లబ్ధి కలిగేలా చూడాలి. ఇప్పటికే కొన్ని విధానాల ద్వారా వారి జీవన స్థితిగతులను మెరు గుపరిచేలా పాలసీలు తీసుకున్నాం. లిక్కర్ షాపుల్లో కల్లుగీత వృత్తిదారులకు, క్వారీల్లో వడ్డెర్లకు కోటా పెట్టాం. నాయీ బ్రాహ్మ ణులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఇలా వివిధ వర్గాలకు ఆర్థికంగా సాయం చేస్తున్నాం. ప్రభుత్వపరంగా అందించే సాయ మే కాకుండా వారి అభివృద్ధికి ఏమి చర్యలు తీసుకోవాలనే అం శంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
ఈ మేరకు వివిధ కుల కార్పొరేషన్ల బైలాస్ మార్చే అంశాన్ని పరిశీలించాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ విధానాలను మిగిలిన కార్పొరేషన్లు కూడా అవలం భించేలా చర్యలు తీసుకోవాలి. జీ రామ్ జీ ద్వారా అంగన్వాడీ భవనాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సందర్భంగా సంక్షేమ శాఖల్లో తాము తీసుకున్న చర్యలను మంత్రులు, అధికారులు వివరించారు. కొందరు విద్యార్థులు హోం సిక్కు గురవుతున్నారని.. అలాంటి విద్యార్థుల కోసం తల్లిదండ్రులతో మాట్లాడేలా స్మార్ట్ కార్డ్ బేస్డ్ టెలీఫోన్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులతో రోజులో 4 నిమిషాలు మాట్లాడుకునే సదుపాయం కల్పంచామని తెలిపారు. సాస్కి కింద సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో రూ.120 కోట్లతో ఆర్వో పాంట్లు, టాయిలెట్స్ సహా ఇతర మౌళిక వసతులను కల్పించే పనులు చేపట్టామని వివరించారు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేశామని… ఈ నెలాఖరు నాటికి టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. సమీక్షలో మంత్రులు డీబీవీ స్వామి, సవిత, సంధ్యారాణి, ఎన్ఎండీ ఫరూక్, మైనార్టీ సంక్షేమ సలహాదారు మహ్మద్ షరీఫ్ సహా వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.















