అమరావతి (చైతన్య రథం): అమరావతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) సహకారంతో రూ.150 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఖగోళ శాస్త్ర కేంద్రం ‘కాస్మోన్-2’ ఏర్పాటుకానుంది. విద్యార్థులకు ఖగోళ శాస్త్రం, గ్రహాలు, నక్షత్రాలపై అవగాహన కల్పించడం, సైన్స్ విద్యను పెంపొందించడంలో భాగంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. అంటే -విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలవంటి సంక్లిష్టమైన విషయాలపై స్పష్టమైన, దృశ్యమానమైన, పూర్తిగా లీనమయ్యే అవగాహనను విద్యార్థులకు అందించడం ద్వారా.. విజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే యోచనతో కాస్మోస్-2ని నెలకొల్పుతున్నారు. అధునాతన లెడ్ డోమ్ థియేటర్, ఇంటరాక్టివ్ సైన్స్ ప్రదర్శనలు, ఖగోళ పరిశోధనా సౌకర్యాలు.. ఈ కేంద్రంలోని ముఖ్యమైన ఫీచరు. అంటే -విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలవంటి సంక్లిష్టమైన విషయాలపై స్పష్టమైన, దృశ్యమానమైన, పూర్తిగా లీనమయ్యే అవగాహనను విద్యార్థులకు అందించడం ద్వారా.. విజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే యోచనతో కాస్మోస్-2ని నెలకొల్పుతున్నారు. అధునాతన లెడ్ డోమ్ థియేటర్, ఇంటరాక్టివ్ సైన్స్ ప్రదర్శనలు, ఖగోళ పరిశోధనా సౌకర్యాలు.. ఈ కేంద్రంలోని ముఖ్యమైన ఫీచర్లు.
ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీసీఆర్డీఏ ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. లెడ్ డోమ్ టెక్నాలజీతో, ఇది అంతరిక్షం, గ్రహాల గమనాన్ని లైవ్లో చూపే అద్భుతమైన విద్యా, పరిశోధనా కేంద్రంగా నిలవనుంది. సాధారణ ప్లానిటోరియాల్లో రికార్డ్ చేసిన వీడియోలు చూపిస్తారు. కానీ అమరావతిలో రాబోయే ఈ కాస్మోస్-2 ప్రత్యేకత వేరు. ఇది కేవలం కళ్లతో చూసేది కాదు, నేరుగా అంతరిక్షంతో కనెక్ట్ విశ్వానుభూతిని పొందే వేదిక కానుంది. అంటే నక్షత్ర మండలాలు, గ్రహాల గమనాన్ని లైవ్లో చూస్తున్న అనుభూతి పొందుతామన్న మాట. సాంకేతికంగా.. పాత ప్రాజెక్టర్లకు భిన్నంగా, అత్యాధునిక లెడ్ డోమ్ టెక్నాలజీని ‘కాస్మోస్-2’ ప్లానిటోరియంలో వినియోగించనున్నారు. ఈ తరహా టెక్నాలజీలో దేశంలో ఏర్పాటవుతున్న ప్లానిటోరియంలలో అమరావతి రెండోది. మొదటిగా మైసూర్లో ఏర్పాటు చేసిన కాస్మోస్-1 ప్రాజెక్టుకు మించి కాస్మోస్-2ను ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ భారతంలో అగ్రగామి ఖగోళ విద్యా కేంద్రంగా కాస్మోస్-2 నిలవనుంది. లెడ్ డోమ్ టెక్నాలజీ రిజల్యూషన్, బ్రైట్ నెస్ వీక్షకులను… నిజంగానే అంతరిక్షంలో విహరిస్తున్నామనే సంభ్రమంలో ముంచెత్తనుంది.
హన్లే లేదా కొడైకెనాల్లోని భారీ టెలిస్కోపులతో లైవ్ అనుసంధానంతో, నక్షత్ర మండలాల కదలికలను లైవ్లో చూసే అవకాశం… కాస్మోన్-2 కలగజేయనుందన్న సమాచారం.. అంతరిక్ష ప్రేమికులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విద్యార్థులలో ఖగోళశాస్త్రంపై ఆసక్తిని పెంచడమే కాదు, రాష్ట్రంలో సైన్స్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఈ ప్లానిటోరియం ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
2026-27 బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కేంద్రం భారీ ఊతమిచ్చింది. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ), భారత ప్రభుత్వ విజ్ఞాన, సాంకేతిక శాఖ, ఏపీసీఆర్డీఏ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. కేవలం 18 నెలల కాలపరిమితితో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 2027 నాటికల్లా అమరావతి గగనతలంనుంచి తారలను తాకే అవకాశం రాబోతోంది. ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, భవిష్యత్ శాస్త్రవేత్తలను తయారు చేసే రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్.
“టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని చూడటం ఒక ఎత్తైతే.. ప్రపంచస్థాయి టెక్నాలజీతో నక్షత్రాల మధ్య విహరించేలా అనుభూతిని పొందడం మరో ఎత్తు.” అమరావతి కాస్మోస్-2 ఆ అనుభవాన్నే మనకు అందించబోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణ భారతదేశంలో అమరావతి ఆస్ట్రో- టూరిజానికి కేరాఫ్ అడ్రస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో నాణ్యమైన విద్యా, సాంస్కృతిక మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేసే బృహత్ ప్రణాళికలో ఈ కార్యక్రమం ఒక భాగం. సో, కాస్మోస్-2తో అమరావతి సైన్స్, రీసెర్చ్ హబ్గా మారనుందని బలంగా చెప్పొచ్చు.












