ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామ త్తో మంత్రి నారా లోకేష్ దావోస్లో సమావేశమయ్యారు. ప్లాట్ ఫామ్ ఇంజనీరింగ్, బ్యాకెండ్ సిస్టమ్స్, ట్రేడింగ్ అల్గోరిథంలు, డేటా అనలిటిక్స్, ఫిన్టెక్ ఆరఅండ్డీపై దృష్టి సారిస్తూ విశాఖ పట్నంలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను నెలకొల్పాలని, ఫిన్టెక్ స్టార్టప్లను ప్రోత్సహించడం, రాష్ట్ర ఎంటర్ ప్రెన్యూర్షిప్ ఎకో సిస్టమ్ను బలోపేతం చేయడానికి లీడ్ మెంటర్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వహించాలని కోరారు. భారతదేశంలో మొట్టమొదటిగా మల్టిపుల్ డెలివరీ ఛానెళ్ల ద్వారా పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫైనాన్సి యల్ లిటరసీ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడానికి ప్రభుత్వంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్ సానుకూలంగా స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాద నలను పరిశీలిస్తామని తెలిపారు.














