కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివరించిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ప్రారంభోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు.. అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఎంత కష్టపడి పథకాలను.. కార్యక్రమాలను అమలు చేస్తున్నామనే విషయాన్ని ముఖ్యమంత్రి వివరించారు. జరుగుతోన్న పరిణామాలను గమనిస్తూ.. రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేసుకుంటూ ప్రభుత్వం పాలన ఏవిధంగా సాగిస్తుందోననే అంశాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ఈ క్రమంలో 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన దాదాపు 100 పథకాలు, కార్యక్రమాలను సీఎం వివరించారు.
తల్లికి వందనం: రూ.10,090 కోట్లు చెల్లింపు. 67.27 లక్షల విద్యార్ధులకు సాయం.
స్త్రీ శక్తి: ఆగస్ట్ 15నుంచి పథకం ప్రారంభం. మహిళలు 63.61 కోట్ల ప్రయాణాలు (మే 6వరకు)
విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం. 20.51 లక్షల ప్రయాణాలు.
దీపం`2 పథకం కింద 4 కోట్ల సిలిండర్లు.
269 అన్న క్యాంటీన్లు. 9.15 కోట్ల భోజనాలు (మే 6నాటికి)
అన్నదాత సుఖీభవ: 46 లక్షల రైతులకు 3 విడతలు కలిపి రూ.8,985 కోట్లు జమ.
ఎన్టీఆర్ భరోసా: ఇప్పటివరకు రూ.63 వేలకోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం.
మత్స్యకార సేవలో: ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షలమందికి రూ.250 కోట్లు.
మత్స్యకారుల కోసం జీవో 217 రద్దు. నీటి వనరులపై హక్కు.
ఆటో డ్రైవర్ల సేవలో: ఏడాదికి రూ.15,000. రూ.436 కోట్లు జమ. 2.90 లక్షలమందికి లబ్ది.
గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు.
వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ.
స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.
ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ.3,670 కోట్లు వ్యయం.
8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనానికి రూ.51 కోట్లు.
ఇమామ్లకు నెలకు రూ.10,000, మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు.
వక్ఫ్ బోర్డు పునరుద్ధరణ. అన్ని వర్గాలకు ప్రాధాన్యం.
పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు.
నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు.
మగ్గాలున్న చేనేతలకు 200, మరమగ్గాలున్న చేనేతలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు.
జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం.
మెగా డీఎస్సీ… ముఖ్యమంత్రి తొలి సంతకం. 15,941 టీచర్ పోస్టుల భర్తీ.
5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి. రూ.4,500నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు.
10 వేలకుపైగా పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల.
భవిష్యత్ నగరంగా అమరావతి నిర్మాణం. శాశ్వత, ఏకైక రాజధానిగా కేంద్రం గెజిట్.
ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి ఊతం.
జె బ్రాండ్స్ రద్దు. నాణ్యమైన మద్యం సరఫరా, బెల్ట్ షాపుల నియంత్రణ.
అంగన్వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు.
బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు.
చెత్త పన్ను రద్దు. దాదాపు 84 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ తొలగింపు.
ప్రతీ నెల ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’. డోర్ టు డోర్ కలెక్షన్. స్వచ్ఛ రథాలు.
రూ.861 కోట్లతో 20,060 కి.మీ పాత్ హోల్ ఫ్రీ రోడ్లు. రూ.2500 కోట్లతో రహదారుల నిర్మాణం.
విజయవాడ-మచిలీపట్నం 6 లైన్ రోడ్డుకు ఆమోదం.
మూలపేట-వైజాగ్-కాకినాడ బీచ్ రోడ్, నాగపూర్`అమరావతి హైవే నిర్మాణం.
హైదరాబాద్-అమరావతి-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా.
రికార్డుస్థాయిలో బెంగుళూరు – అమరావతి హైవే పనులు.
గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లెపండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం.
అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం. శివారు గ్రామాలకు 4జీ నెట్వర్క్.
కొత్తగా 28 పాలసీలు. పరిశ్రమలకు రాయితీలకు దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు.
దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి. బిజినెస్ రిఫార్మర్ అవార్డు.
సీఐఐ సమ్మిట్ 538 ఒప్పందాలు. రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు. 13.95 లక్షల ఉద్యోగాలు.
17 ఎసఐపీబీ సమావేశాల్లో రూ.11,37,222 పెట్టుబడులు. 10,01,147 లక్షల ఉద్యోగాలు.
175 నియోజకవర్గాల్లో ఎంఎసఎంఈ పార్కులు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్.
విశాఖ ఐటీ హబ్. టీసీఎస్ ప్రారంభం. కాగ్నిజెంట్కు శంకుస్థాపన.
తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెనుమార్పులు. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు.
15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల. 90కిపైగా సీఎసఎస్ పథకాల పునరుద్ధరణ.
ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు.
100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ.
రాయలసీమలో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నింపి సాగు, తాగునీరు.
సాగునీటి ప్రాజెక్టులకు 23 నెలల్లో రూ.24 వేల కోట్లు ఖర్చు.
శరవేగంగా పోలవరం నిర్మాణం. డయాఫ్రం వాల్ పూర్తి. విశాఖకు నీళ్లు.
రూ.2 వేల కోట్లతో పోలవరం నిర్వాసితులకు పునరావాసం.
వెలిగొండ ప్రాజెక్టుకు రూ.571 కోట్లు వ్యయం. జులైనాటికి తొలి దశ పూర్తి.
తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి. ఏపీ వాటాగా రూ.55 కోట్ల కేటాయింపు.
చింతలపూడి ఎత్తిపోతల అనుమతుల్లో పురోగతి.
సాగు నీటి ప్రాజెక్టులకు రూ.610 కోట్లతో మరమ్మతులు.
రాష్ట్రవ్యాప్తంగా కాలువల నిర్వహణ. పూడికలతీత, లాకుల మరమ్మతులకు నిధులు
మళ్లీ సాగునీటి సంఘాల కీలక పాత్ర. 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు.
రాజధానిలో క్వాంటం వ్యాలీ భవనాలకు శంకుస్థాపన.
క్వాంటమ్ రిఫరెన్స్ ఫెలిసిటీ సెంటర్ ప్రారంభం.
కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన.. రెండేళ్లలో గ్రీన్ అమోనియా ఎగుమతి.
రికార్డ్స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో డబ్బులు జమ.
మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి పంటలకు రూ.1,100 కోట్లు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం…. పెరిగిన మూలధన వ్యయం.
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. నాలా చట్టం, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు.
గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో… డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ.
విద్యా వ్యవస్థలో పెనుమార్పులు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్.
పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల సాధన. ముస్తాబువంటి వినూత్న కార్యక్రమాలు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు.
గాడిన పడిన విద్యుత్ రంగం. ట్రూ డౌన్కు అంకురార్పణ.
యూనిట్ కాస్ట్ 0.30 పైసలు తగ్గింపు. మరో 0.30 పైసలు తగ్గింపునకు లక్ష్యం
ఈవీలకు ప్రోత్సాహం. వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గింపు.
90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందాలు.
20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్.
సోలార్ రూఫ్ టాప్లో బీసీలకు రూ.20 వేల అదనపు సాయం.
స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ,
పీ4 ద్వారా పేదరిక నిర్మూలన. 2 లక్షల కుటుంబాలకు చేయూత
మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1035 సేవలు.
విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి.
కేంద్రంతో సమన్వయం. దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్దరణ.
రుణాల రీ షెడ్యూల్తో వడ్డీ తగ్గింపు.
రాష్ట్రానికి సెమీ కండక్టర్, డిఫెన్స్ పరిశ్రమలు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.11440 కోట్లతో కేంద్ర సాయం.
వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం.
జూలైనాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి.
లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు.
లక్షమంది మహిళా పారిశ్రామిక వేత్తలు. మరో 5 లక్షలమంది లక్ష్యం.
శ్రీ సిటీలో రూ.5 వేల కోట్లతో ఎల్జీ, రూ.1000 కోట్లతో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన.
రూ.5,400కోట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థకు శంకుస్థాపన.
అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ ప్లాంట్కు శంకుస్థాపన.
విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్కు శంకుస్థాపన
రూ.లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు.
23 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు పేదలకు అందజేత. మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పం.
50 వేలమంది కాంట్రాక్టర్లకు రూ.2 వేల కోట్లు చెల్లింపులు.
ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు.
అగ్నిమాపక శాఖ బలోపేతం. రూ.34 కోట్లతో కొత్త పరికరాలు, వాహనాలు.
తగ్గిన క్రైమ్ రేట్. మహిళల భద్రతకు ప్రాధాన్యత.
గంజాయి-డ్రగ్స్పై ఉక్కుపాదం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు














