- చిన్నప్పుడు టీచర్లు కొట్టారనే కోపంతోనే జగన్ వాళ్లపై కక్షగట్టాడు
- ఆయన తెచ్చిన కంపెనీలు ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్
- డీఎస్సీ విషయంలో జగన్ చేస్తున్న ఆరోపణలు అంబేద్కర్ రాజ్యాంగంపైన
- జగన్ పేరులో ఉన్న జీ అంటే జెన్జీ కాదు… గొడ్డలి, విధ్వంసమే ఆయన అజెండా
- డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు
- రూ.లక్ష కోట్లతో ‘మిషన్ రాయలసీమ’ ప్రాజెక్టు
- కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలో మంత్రి నారా లోకేష్
తిరుపతి (చైతన్యరథం): రాయలసీమను ‘రాయల’సీమగా మార్చడమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యం. లక్ష కోట్లతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోంది అని రాష్ట్ర విద్య, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం దామినేడులో నిర్వహించిన విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్లతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ‘రాయల్ ఎన్ఫీల్డ్, క్యారియర్, ఎల్జీ, రిలయన్స్ సీమకే వచ్చాయి. ఇది రాయలసీమపై మాకున్న నిబద్ధత. టీడీపీ, జనసేన, బీజేపీ… మనది పెద్ద కుటుంబం. రాష్ట్రం కోసం, ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి. ఇగోలు వద్దు, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలి. అహంకారం వద్దు…అహంకారం వల్లే వాళ్లకి 151-11 అయ్యాయి. ప్రజల్లోకి చేసిన, చేస్తున్న మంచి పనులు చెబుతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రశాంతంగా జనం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రశాంతత వచ్చింది. దాడులు లేవు, జేసీబీలు, కబ్జాలు, హత్యలు, బెదిరింపులు, బూతులు కూడా లేవు. రాష్ట్రంలో ఉన్నది ఒక్కటే ప్రశాంతత. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది… ప్రశాంతంగా ఉన్నారు. తిరుపతి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే చంద్రగిరి గడ్డపై నేను ఒక మాట చెప్పాను. వెంకన్న చాలా పవర్ ఫుల్… అయనతో పెట్టుకోవద్దు… మాడి మసైపోతావు అని జగన్కి చెప్పాను. ఆయనకి అర్థం కాలేదు.. డైరెక్ట్గా స్వామితోనే పెట్టుకున్నారు. 2024లో ఏం జరిగిందో మీరంతా చూశారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకి సీమ అంటే ప్రేమ. రాయలసీమకు కరువు వస్తే జోలె పట్టి ప్రజలను ఆదుకుంది ఎన్టీఆర్. తెలుగు గంగ, గాలేరు-నగరి ప్రాజెక్టులను రూపకల్పన చేశారాయన. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, 50 హార్స్ పవర్ విద్యుత్, తిరుమలలో నిత్యాన్నదానంలను ప్రారంభించిందీ ఆయనే.
ప్రజలే వారిని రఫ్పాడిస్తారు…
2019 నుంచి 2024 వరకు గొడ్డలి పార్టీ అరాచక పరిపాలనను మనం చూశాం. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్పై పెట్రోలు పోసి చంపేశారు. దళిత వైద్యుడు సుధాకర్పై పిచ్చోడని ముద్ర వేసి చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. అబ్దుల్ సలామ్ కుటుంబంతో సామూహికంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. కుటుంబాన్ని విడిచి మిస్బా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. టీడీపీ జెండా లేకుండా చేస్తామ న్నారు… ప్రజలే వాళ్ల జెండా పీకేశారు. వైనాట్ 175 అన్నారు. అందుకు ప్రతిగా టీమ11 ఇచ్చారు. వాళ్లు సిద్ధం అంటే… ప్రజలు యుద్ధం అన్నారు. మమ్మల్ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమన్నారు, ప్రజలే వాళ్లని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారు. ఇప్పుడు రప్పా రప్పా అంటున్నారు… ప్రజలే రఫ్పాడిస్తారు.
రాజకీయాల్లో విరాట్ కోహ్లీ ‘సీబీఎన’
రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన సీబీఎన్. అవతలవైపు బౌలర్లు మారతారు తప్ప ఇటువైపు ఒకే ఒక్క బ్యాట్స్మన్ సీబీఎన్. అటువైపు బౌలర్ ఎవరైనా ఇటు సూపర్ సిక్స్ కొట్టేది మాత్రం మన సీబీఎన్నే. రాయలసీమను రాయల్ సీమగా మార్చేసింది మన సీబీఎన్. అప్పుడు కియా…ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్. డ్రిప్ ఇరిగేషన్తో సీమలో బంగారం పండేలా చేసింది మన సీబీఎన్. హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా కుప్పానికి నీళ్లు ఇచ్చింది మన సీబీఎన్. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చింది మన సీబీఎన్. ఇప్పుడు లక్ష కోట్లతో మిషన్ రాయలసీమ స్టార్ట్ చేస్తున్నదీ మన సీబీఎన్.
రెండేళ్లుగా సుపరిపాలన అందించాం
ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సుపరిపాలన అందించాం. అన్నీ చేసేశామని కాలర్ ఎగరేయట్లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రూ.2వేల పెన్షన్ను ఒకేసారి రూ.4వేలకు పెంచాం. అన్నా క్యాంటీన్లు, డీఎస్సీ ద్వారా 16,347 టీచర్, 6వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. అదే విధంగా చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాం. ఆటోవాలా సేవలో, మత్స్యకార సేవలో, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి ఉచిత బస్సు, దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల అందజేత, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ వంటివి అమలు చేస్తూ జనరంజక పాలన అందిస్తున్నాం.
జగన్ పేరులో జీ అంటే గొడ్డలి
ప్రజా ప్రభుత్వ నినాదం ఒక్కటే. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. దేశంలోకి వచ్చిన ప్రతి వందలో 25శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి బడా సంస్థలు ఉత్తరాంధ్రకు క్యూ కట్టాయి. రాజధాని ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన క్వాంటం వ్యాలీ ఆవిష్కృతమవుతోంది. రాయలసీమకు ఎవరూ ఊహించని విధంగా ఫైటర్ జెట్స్ పరిశ్రమను, రాయల్ ఎన్ఫీల్డ్ను రప్పించాం. మనది గూగుల్… వాళ్లది గొడ్డలి. మనది ఫైటర్ జెట్స్… వాళ్లది ఫ్యాక్షన్. మనది కియా… వాళ్లది కిడ్నాప్. మనది విశ్వసనీయత… వాళ్లది నేరం. మనది అభివృద్ధి… వాళ్లది విధ్వంసం. మనది బుల్లెట్… వాళ్లవి బూతులు… మనది మహిళలకు 33% రిజర్వేషన్ … వాళ్లది సొంత తల్లిని, చెల్లిని గెంటేయడం. జగన్ అనే పేరులో ఉన్న జీని జెన్జీ అనుకుంటున్నాడు. కానీ జగన్లో ఉన్న జీ అంటే గొడ్డలి.
ఆయనకు సీసీడీ జబ్బు ఉంది
జగన్కి సీసీడీ అనే జబ్బు ఉంది. సీసీడీ అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్. మేము కష్టపడి గూగుల్ తీసుకువస్తే… ప్రెస్మీట్ పెట్టి వాళ్ల వల్లనే గూగుల్ వచ్చిందన్నారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అని పేపర్లో వస్తే.. రావడం లేదు అని ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. దాని భూమి పూజ తర్వాత నేనే తెచ్చాను అని ప్రెస్మీట్ పెట్టి మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇంకా కొంచెం టైమ్ ఇస్తే ఆగస్టు 15న ప్రెస్మీట్ పెట్టి భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది మా తాతే అని కూడా ప్రకటిస్తాడు సీసీడీ జగన్. ఆయన తెచ్చిన కంపెనీలు కొన్ని ఉన్నాయి…. అవి ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్.
అపట్లో టీచర్లు కొట్టారనే జగన్కు కోపం
చిన్నప్పుడు 10వ తరగతి పేపర్ లీక్లో దొరికితే వాళ్ల టీచర్లు జగన్ను చితగ్గొట్టారు. అందుకే ఆయనకి టీచర్లంటే కోపం. ఉపాధ్యాయులను మద్యం దుకాణాలు ముందు నిలబెట్టిన చరిత్ర జగన్ది. మెగా డీఎస్సీని అడ్డుకోడానికి 226 కేసులు వేశారు. 150 రోజుల్లో మనం మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 పోస్టులు భర్తీ చేశాం. ఇందులో ఏదో జరిగిందని బురద జల్లుతున్నారు. ఈ విషయంలో జగన్ నన్ను, సీబీఎన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లను ప్రశ్నిస్తున్నారు. జగన్ మీరు ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరు. నేను పాదయాత్రలో ఇచ్చిన హామీని మీ నిలబెట్టుకున్నాను. జగన్కి కనీసం దేశం భక్తి కూడా లేదు. మేము సాగర్ డిఫెన్స్ కంపెనీ తీసుకొస్తే దాని మీద కూడా నకిలీ ప్రచారం చేశారు. సాగర్ రక్షణ సంస్థ దేశ రక్షణ కోసం బోట్లు తయారు చేస్తుంది. కనీసం 1000 మంది మత్స్యకార పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు సాగర్ సంస్థను మేము తీసుకొస్తే అనేక ఆరోపణలు చేసి ఆ కంపెనీని కూడా తరిమేయాలని ప్రయత్నించారు.
స్టీల్ ప్లాంట్ను కాపాడిన చరిత్ర ఎన్డీయేది
ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే రెండుసార్లు కాపాడిన చరిత్ర ఎన్డీయేది. స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేసి అక్కడ రాజధాని కడదామనే ఆలోచన మీది. మొన్న స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. కొంత మంది కార్మికులు చనిపోయారు. చనిపోయిన పర్మినెంట్ ఉద్యోగి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రూ.2కోట్లు ఇస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి ఒక కోటి ఇస్తుంది. అంతే కాకుండా పర్మినెంట్ జాబ్ ఇస్తున్నాము. ఎవరైనా ఎక్కువ ఇవ్వమని అడగొచ్చు. కానీ జగన్ కోటి ఇవ్వమని డిమాండ్ చేశారు.
‘నమో’ వల్లే మనకు గౌరవం
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనకి గౌరవం దక్కుతోంది. ప్రపంచం మొత్తం మన దేశంవైపే చూస్తోంది. దానికి కారణం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన రికార్డులను బద్దలుకొట్టడం ఎవరికీ సాధ్యంకాదు. దేశం మొత్తం నమో అంటే నరేంద్ర మోదీ. ఏపీలో మాత్రం నమో అంటే నాయుడుజీ, మోదీజీ. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరానికి నిధులు, ఫైటర్ జెట్, Aవ్పుీA ప్రాజెక్టు వచ్చాయి. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకురాబోతున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.














