- ఏఐ, డేటా సెంటర్లతో ఎకో సిస్టం ఏర్పడుతోంది
- స్టార్టప్ కంపెనీలకు పెద్దఎత్తున ప్రోత్సాహం
- 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రీజియన్
- కాగ్నిజెంట్లో 85 శాతం మంది భారతీయులే
- భవిష్యత్తులో ఇక్కడ లక్ష మందితో పనిచేయాలి
- కాగ్నిజెంట్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు
- 25 వేల ఉద్యోగాలు: కాగ్నిజెంట్ సీఈవో ప్రకటన
విశాఖపట్నం(చైతన్యరథం): అత్యంత సురక్షిత నగరం విశాఖ లో ఐటీ ఎకో సిస్టం ఏర్పడుతోంది..ప్రభుత్వం తీసుకుంటున్న చర్య ల వల్ల ఐటీ కేంద్రంగా అవతరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం కాపులుప్పాడ ఐటీ హిల్స్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి శుక్రవారం శంకు స్థాపన చేశారు. దానితో పాటు మరో 8 సంస్థలకు కూడా శంకు స్థాపనలు జరిగాయి. ఇక్కడ 25 వేల మంది ఉద్యోగులు పనిచేసే లా అత్యాధునిక వసతులతో కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణాన్ని కాగ్నిజెంట్ పూర్తి చేసు కోనుంది. అప్పటివరకు తాత్కాలిక కార్యాలయంలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తోంది. చెన్నై, హైదరాబాద్, బెంగుళూ రు, కలకత్తా, పూణేలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ఉన్నా యి. ఇప్పుడు విశాఖకూ కాగ్నిజెంట్ అడుగుపెట్టింది. హ్యాపెనింగ్ సిటీ విశాఖకు రావాలని కాగ్నిజెంట్ను ఆహ్వానించినట్లు తెలిపారు.
భవిష్యత్తులో లక్ష మందితో పనిచేయాలి
త్వరలో 25 వేల మందితో పనిచేసే కేంద్రంగా కాగ్నిజెంట్ త్వరలోనే తయారుకావాలి. 34 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ కార్యకలాపాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. కాగ్నిజెంట్లో 85 శాతం మంది భారతీయులే. ఆ సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావటం విశేషం. భవిష్యత్తులో విశాఖ క్యాం పస్లో లక్ష మంది ఉద్యోగులతో పనిచేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా కాగ్నిజెంట్ ఎదుగుతోంది. గతంలో హైదరాబాద్లో నాటి టీడీపీ ప్రభుత్వం రూపోందించిన ఎకో సిస్టం తో ఐటీ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. 3 దశాబ్దాల క్రితం చేసిన విజన్తోనే దిగ్గజ ఐటీ కంపెనీలకు భారతీయులు నాయకత్వం ఇస్తున్నారు. 1995లో వచ్చిన ఇంటర్నెట్ రివల్యూ షన్తో పాటు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అందు కే ఐటీకి బ్యాక్ బోన్గా భారతీయులు నిలిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసు కోవాలని భావిస్తున్నాం. ఆ దిశగానే ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ ఐటీ డెస్టినేషన్గా, నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా తయారవుతోందని వెల్లడిరచారు.
బెస్ట్ కనెక్టివిటీ..మోస్ట్ లివబుల్
విశాఖ నగరానికి బెస్ట్ కనెక్టివిటీ ఉండడంతో పాటు.. మోస్ట్ లివబుల్ సిటీగా ఉంది. భోగాపురం విమానాశ్రయం, మెట్రో లాంటి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు వస్తాయి. ప్రపంచం లోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ రూపుదిద్దుకుంటుంది. నౌకాదళ కేంద్రం నుంచి టూరిజం కేంద్రంగా, ఇప్పుడు టెక్ సిటీగా విశాఖ ఎదిగింది. కాగ్నిజెంట్తో పాటు 8 సంస్థలకు ఈ రోజు భూమిపూజ చేశాం. గూగుల్ కూడా త్వరలోనే డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే విశాఖలో 150 టెక్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో నైపుణ్యం సాధించిన యువత ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డారు. దేశంలోని ఇతర ప్రాం తాలతో పోలిస్తే 20 శాతం జీవన వ్యయం కూడా తక్కువ. ప్రపం చంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ లివబుల్ సిటీగా విశాఖను తీర్చిది ద్దుతాం. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరం కూడా విశాఖే. 2032కి 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా విశాఖ ఎకనామిక్ రీజియన్ తయారవుతుందని తెలిపారు.
ఐటీ కంపెనీలకు భూములు.. గేమ్ ఛేంజర్
ఎకరా భూమి 99 పైసలకే ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఓ గేమ్ ఛేంజర్. గుజరాత్లో టాటా నానో కారు తయారీ కేంద్రానికి కూడా 99 పైసలకే ఎకరా చొప్పున భూమి ఇచ్చారు. ఇటీవలే భాగస్వామ్య సదస్సులో 613 ఎంఓయూల ద్వారా రూ.13.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే ఎస్ఐపీబీల ద్వారా మరో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించాం. నేషనల్ క్యాంటం మిషన్ను అందిపుచ్చుకుని ఏపీలోని అమరావతి లో క్యాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దేశం లోనే తొలి క్వాంటం కంప్యూటర్ కేంద్రం అమరావతిలో ఏర్పాటు కాబోతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను భారతదేశంలో పెట్టుకుంటున్నారు. భార తదేశం వైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తోంది. ఈ క్రమం లో ఏపీని, విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు వస్తున్నాయి. కాగ్నిజెంట్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా విశాఖలో పెట్టాలని కోరుతున్నా ను. రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ జోన్లు ప్రపంచస్థాయి ఉత్ప త్తులు తయారు చేస్తున్నాయి. పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ఎస్క్రో ఖాతాను పెడుతున్నాం. ఈ తరహాలో ఆలోచిం చే ప్రభుత్వాలు ఉండవు. ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్లకు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను కూడా రూపోందిస్తున్నాం. 15 శాతం వృద్ధి రేటు సాధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
8 వేలు కాదు..25 వేలు
కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ సీఈఓ రవికుమార్ కీలక ప్రకటన చేశారు. విశాఖ కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడిరచా రు. 8 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వంతో కాగ్నిజెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి ముందుగా రవికుమార్తో సీఎం చంద్రబాబు కొద్దిసేపు సంభాషించారు. 8 వేల ఉద్యోగాలు కాదని.. విశాఖ క్యాంపస్లో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు శంకుస్థాపన కార్యక్రమం వేదికగా చంద్రబాబు సమక్షంలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని రవికుమార్ ప్రకటించారు. విశాఖకు రావడం తన సొంతింటికి వచ్చి నట్టుందని రవికుమార్ తెలిపారు.
మరో 8 సంస్థలకు శంకుస్థాపనలు
కాగ్నిజెంట్ సంస్థతో పాటు త్వరలోనే విశాఖ నుంచి మరి కొన్ని సంస్థలు కూడా కార్యాకలాపాలు మొదలు పెట్టనున్నాయి. వీటిల్లో కొన్నింటికి శుక్రవారం నాడే శంకుస్థాపనలు జరిగాయి. టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ వంటి సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయి. త్వరలో విశాఖలో తమ కార్యకలాపాలు చేపట్టనున్నట్టు ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి రూ.3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ప్రస్తుతం విశాఖలో 150కి పైగా టెక్ కంపెనీల కార్యకలాపాలు సాగిస్తుం డడంతో రాష్ట్రంలో ఐటీ నిపుణులకు విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ఒక్క విశాఖ లోనే రూ.1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, డీబీవీ స్వామి, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు ఘంటా శ్రీని వాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, కాగ్నిజెంట్ సీఈ వో రవికుమార్, ఐటీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














