- ఇక రికార్డులు ఎవరూ తారుమారు చేయలేరు
- వాటిని భద్రపరిచేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ
- వచ్చే మార్చికి 1.12 కోట్ల పాస్ పుస్తకాలు
- 1.37 లక్షల ఎకరాలు ఇనాం 22ఏ నుంచి తొలగింపు
- ఆటో మ్యూటేషన్ తర్వాత నేరుగా ఇంటికే పాస్ పుస్తకం
- గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారు
- పూర్తిగా ప్రక్షాళన చేసి వివాదాలను పరిష్కరిస్తున్నాం
- వారసత్వ భూముల విషయంలోనూ సంస్కరణలు
- మినీ గోవాగా సూర్యలంక బీచ్ అభివృద్ధి చేస్తాం
- ‘మీ భూమి-మీ హక్కు’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
బాపట్ల(చైతన్యరథం): రాష్ట్రంలో భూ సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తోందని, 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టదారు పాసుపుస్తకాలు పంపిణీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా పాసుపుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. ఆటో మ్యూటేషన్ తర్వాత నేరుగా ఇంటికి పాస్ పుస్తకాలు పంపాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లి గ్రామంలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిం చారు. వేదికపై రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశా రు. వారి సమక్షంలోనే పొలం వివరాలను అధికారులతో చదివి వినిపించారు అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత పభుత్వంలో ప్రజల భూమిపై కన్నేసి కబ్జాలు చేశారు. ప్రశ్నించిన వారిని కట్టడి చేసేందుకు బ్లాక్ మెయిల్ చేశారు. రికార్డులు తారుమారు చేశారు. ప్రతీ గ్రామం, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపి భయానక వాతావరణం సృష్టించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపైనా జగన్ తన ఫొటో వేసుకున్నాడు. సరిహద్దు రాళ్లపైనా బొమ్మలు చెక్కించు కున్నాడు. ఇందుకోసం వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. వారు అధికారం నుంచి దిగిపోయినా పాపాలు, అక్రమా లు ఇంకా వెంటాడుతున్నాయి. అంతలా రెవెన్యూ వ్యవస్థను నాశ నం చేశారు. ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతినెలా నేను స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు.
మార్చి నాటికి రీ సర్వే పూర్తి
భూమి అనేది ఆస్తి మాత్రమే కాదు. భద్రత, జీవనాధారం. అర్జీల్లో రెవెన్యూ సమస్యలవే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలని సంకల్పించాం. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం రీ సర్వే 2.0 చేపట్టాం. రాష్ట్రంలో మొత్తం 16,816 గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీ సర్వే పూర్తి చేసి ప్రతి ఒక్కరికి రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇస్తాం. ఈ జనవరి నుంచి మార్చి వరకు 21.23 లక్షల కొత్త పాసుపుస్తకాలు ఇచ్చాం. ఈ నెలలో 356 గ్రామాల్లో 1,56,433 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. జూలై నాటికి మరో 9 లక్షల పట్టాదారు పుస్తకాలు ఇస్తాం. 11,099 గ్రామాల్లో కొత్తగా ఇవ్వాల్సిన 80 లక్షలు పాస్ పుస్తకాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పంపిణీ చేస్తాం. 1.10 కోటి మందికి పాస్ పుస్తకాలు ప్రజలకు అందిస్తాం. కరెన్సీకి వాడే టెక్నాలజీనే పాస్ పుస్తకాలకూ వాడుతున్నాం. భవిష్యత్లో ఎవరూ రికార్డులు తారుమారు చేయలేరు. రాజీలేకుండా మూడుసార్లు పట్టాదారుకు చెప్పి ఈకేవైసీ చేస్తున్నాం. రికార్డులు ట్యాంపరింగ్ చేయకుండా వాటిని భద్రపరిచేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ పెట్టాం. రికార్డుల లాకర్ సిస్టమ్ తెచ్చాం. దీని ద్వారా భూ యజమానులు ఆధార్, ఈ కేవైసీ ఇచ్చి తమ భూముల రికార్డులు లాక్ చేసుకోవచ్చు. రికార్డ్ లాకింగ్ అనేది రక్షణ కవచం గా ఉంటుంది. ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించేందుకు ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు.
లక్షలాది ఎకరాలకు విముక్తి
“1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇతర సర్వీస్ ఇనాంలోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పించేం దుకు 2019లోనే ఆర్డినెన్స్ తెచ్చాం. 2016కు ముందు ఏదైనా ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు వరంగా మారనుంది. 2016 ముందు పట్టా కలిగిన యజమాని.. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, విక్రయించేందుకు, గిఫ్ట్ డీడ్గా ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. 22-ఏ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా సంస్కరిస్తున్నాం. గత ప్రభుత్వంలో 14 లక్షల ఎకరాల పట్టా భూములను 22ఏలో పెడితే గుర్తించాం. 22ఏపై కలెక్టర్ అధికారాలు వికేంద్రీకరిస్తున్నాం. జేసీ, ఆర్డీవోలకు కొన్ని అధికారా లు బదలాయించాలని నిర్ణయించాం. దీంతో సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. వెబ్ల్యాండ్ తప్పులు సుమోటోగా సరిదిద్దే లా ఆర్డీవోలు, తహశీల్దారులకు అధికారం ఇస్తాం. ఇప్పటికి 13.59 లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ కింద ఉంది. ఇందులో అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాల భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం. నిలుపుదల ఉత్తర్వులను ఎత్తివేస్తున్నాం. భూ వినియోగ మార్పులు, మిస్సింగ్ సర్వే నెంబర్ల సేవలను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు.
9 లక్షల భూ లావాదేవీలు ఆటో-మ్యూటేషన్
జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 9 లక్షల భూ లావాదేవీలు ఆటో-మ్యూటేషన్ చేశాం. సేల్, బహుమానం, పార్టీషన్ డీడ్స్లో 100 శాతం ఆటో-మ్యూటేషన్ తీసుకొచ్చాం. పట్టణ ప్రాంతంలోని ఆస్తులను కూడా ఆటోమ్యూటేషన్లోకి తీసుకువచ్చాం. ఇకపై పాస్బుక్ కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండకూడదు. ఆస్తి అమ్మితే నేరుగా మీ ఇంటికే పాస్ బుక్ వస్తుంది. ఆటోమ్యుటేషన్ తో పాటు, పాస్ బుక్ కూడా ప్రింట్ చేసి నేరుగా యజమానికి ఇంటికి అధికారు లు పంపాలి. వారసత్వంగా వస్తున్న భూముల విషయంలోనూ సంస్కరణలు తెచ్చాం. రూ.10 లక్షల లోపు ఆస్తులకు రూ.100, రూ.10 లక్షల పైబడి ఆస్తులకు రూ.1,000తోనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం తెచ్చాం. రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి ఎదురు చూడకుండా స్లాట్ బుకింగ్ విధానం తెచ్చాం. ప్రభు త్వం కంటిన్యూ అయి ఉంటే ఇలాంటివన్ని ఎప్పుడో అమల్లోకి వచ్చేవి. కుటుంబసభ్యులతో ఆస్తి వివాదాల విషయంలో పంతా లకు పోవద్దు. కన్నతల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి ఆదర్శం కాదు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. పొలం గట్లు దగ్గర ఒక సెంటు కోసం కొట్లాడుకుని పోలీస్ స్టేనషన్ల చుట్టూ తిరుగుతుంటారు. కక్షలకు దూరంగా ఉండి గౌరవంగా బతుకుదాం. భూ వివాదాలు ఉండే గ్రామాలను కలెక్టర్లు గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
సూర్యలంక బీచ్ను మినీ గోవాగా అభివృద్ధి చేస్తాం
“ప్రతీ వ్యక్తికి సంక్షేమం, అభివృద్ది ఎలా అందుతోంది, అధికారులు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారో సమాచారం తెప్పిస్తున్నాం. ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం. కుల, మత, ప్రాంతాల వారీగా రాజకీయాలు చేస్తే అభివృద్ధి ఉండదు. గత ఐదేళ్లూ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ను మరో గోవాగా తయారుచేస్తాం. ఈ ప్రాంతంలో టూరిజాన్ని ప్రోత్సహించడం వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక్కడి ప్రజల ఆదాయం పెంచడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సముద్రపు నాచు సీవీడ్ ద్వారా మత్స్యకారులు స్థానికులకు అదనపు ఆదా యం వస్తుంది. మత్స్యకారుల జీవనోపాధికి నష్టం రాకూడదు. మన సముద్ర జలాలపై మత్స్యకారులదే హక్కు. ఇతర ప్రాంతా ల జాలర్లు వస్తే ఉపేక్షించేంది లేదు. గత ప్రభుత్వంలో 217 జీవో ద్వారా స్థానిక నీటి వనరుల్లో చేపల పెంపకానికి మత్స్యకారులను దూరం చేశారు. మేం అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసి మత్స్యకారుల జీవనానికి సహకరించాంమని తెలిపారు.
వేమూరు నియోజకవర్గ అభివృద్ధికి హామీలు
“రాష్ట్రం బాగుండాలంటే కూటమి ప్రభుత్వం సుధీర్ఘంగా అధికారంలో ఉండాలి. త్వరలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు రానున్నాయి. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం నా అదృష్టంగా భావిస్తు న్నాను. ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి చివరి రోజవుతుంది. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు అంతా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఉద్యోగులకు అండగా ఉంటాం. వేమూరు నియోజక వర్గంలో తుంగభ్రద డ్రైయిన్పై బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నాం. కొల్లూరు ఫర్రీ రోడ్డుపై హెచఎల్బీ నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయి స్తాం. భట్టిప్రోలు, పెసలకం రోడ్డుపై కల్వర్టు నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తాం. రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. లంక గ్రామాలు కోతకు గురికాండా చర్యలు తీసుకుంటాం. అలాగే వేమూరులో ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో పెద్దఎత్తున పరిశ్ర మలు స్థాపించి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పీ4 కింద రోడ్డు నిర్మాణానికి యాజలి గ్రామానికి చెందిన సత్యనారాయణ రాజు రూ.కోటి విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసా ద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నరేంద్ర వర్మ, సీఎస్ సాయి ప్రసాద్, ఎంపీ కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















