- ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం కీలక మలుపు
- రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
- సజీవ చరిత్ర ఆడియో రూప పుస్తకావిష్కరణ
హైదరాబాద్(చైతన్యరథం): రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనదని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన 1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని ఎఫ్ఎన్సీసీలో నిర్వ హించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొని ఆవిష్కరిం చారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మా తెలుగు తల్లికి గీతాలాపన జరిగింది. జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీ జనార్దన్ చైర్మన్గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఈ సజీవ చరిత్ర పుస్తకం ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఇందులో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నందమూ రి రామకృష్ణ, సినీ నిర్మాత కె.ఎస్.రామారావు, బొల్లినేని క్రిష్ణయ్య, చైతన్యరాజు, పుస్తక రచయిత విక్రమ్ పూల, ఆడియో పుస్తకానికి గాత్రధారణ చేసిన గాయత్రి, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్మోహన్రావు, గుమ్మడి గోపాలకృష్ణ, మండవ సతీష్, మధు సూదనరాజు, బిక్కి కృష్ణ, ప్రొఫెసర్ వెంకట్, పర్వతనేని రాం బాబు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా రచయిత విక్రమ్ పూల పుస్తక పరిచయం చేశారు. స్వాగతోపన్యాసం చేసిన కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్.. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పురందేశ్వరి కీలకోపన్యా సం చేశారు. 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ఎన్టీఆర్ జీవి తంలోనే ప్రధాన సంఘటన అని, అంతేకాకుండా దేశ రాజకీ యాలను పూర్తిగా మార్చివేసిన ఘటన అని పేర్కొన్నారు. ఈ సంఘటన జరగక ముందు దేశంలో పార్టీ ఫిరాయింపులు, ప్రభు త్వాలను పడగొట్టే అనైతిక చర్యలు జరిగేవని, అయితే ఎన్టీఆర్ ఆయనకు మద్దతు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షాలు, మీడియా, ప్రజా స్వామ్య వాదులు చేసిన పోరాటం వల్ల 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ భావజాలాన్ని నలుదిక్కుల వ్యాపింపజేస్తున్న ఎన్టీఆర్ కమిటీ లిటరేచర్ సభ్యులకు చైర్మన్ టీడీ జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయించడంలో, ఎన్టీఆర్ పేరిట బంగారు నాణెం విడుదల చేయించడంలో తన వంతు కృషి చేశాను అని, కొంతమేర నాన్నగారి రుణాన్ని తీర్చుకోగలిగాను అని తెలిపారు.
ఎన్టీఆర్ పేరు అజరామరం
టీడీ జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించినా అందరికీ గుర్తుండిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలుగునాట రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు..ఎన్టీఆర్ తర్వాత అన్నట్టుగా పాలన సాగిందని చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తాము ఎన్టీఆర్ సిద్ధాంతాల భావజాలాన్ని ముందుతరానికి, తర్వాత తరానికి తెలియజెప్పాలని ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేశారని అందరి సహకార సమన్వయంతో ఎన్టీఆర్పై పలు పుస్తకాలు వెలువరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశామని భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఎన్టీఆర్ పేరు ని అజరామరం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే, మంత్రిని అయ్యా
సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అతి సామాన్యుడైన తనను రాజకీయంగా ప్రోత్సహించడం వల్లే ఆరు పర్యాయాలు ఎమ్మెల్యే ను కాగలిగానని, మంత్రిని కాగలిగానని తెలిపారు. పేదరికాన్ని ముద్దాడిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, పేదోళ్ల ఆకలి గురిం చి, సంక్షేమం గురించి ఆలోచించిన ఎన్టీఆర్ తన గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని పేర్కొన్నారు.
విశ్రాంతి తీసుకోమని సూచించినా..
ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ 1984 ఆగష్టు నాటి రాజకీయ పరిస్థితులు తమ కుటుంబాన్ని ఏ విధంగా ఆవేదనకు గురి చేశాయో గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తమ మాతృమూర్తి క్యాన్సర్తో బాధపడుతుందని, తండ్రి అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చిన సమయంలో పదవీచ్యుతుడిని చేశారని గుర్తుచేశారు. విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినా ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్య పోరాటం చేసినట్లు తెలిపారు. కాగా సజీవ చరిత్ర గాత్రధారణ చేసిన గాయత్రిని పురందేశ్వరి, టీడీ జనార్దన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, ఇతర సినీ పెద్దలు వందలాదిగా పాల్గొన్నారు.















