- దివ్యాంగ శక్తి పథకంతో ఆర్థిక వెసులుబాటు
- సీఎం చంద్రబాబు నాయుడు
- దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం
- ఆర్టీసీ బస్సులో వారితో కలిసి ప్రయాణం
- అందులోనే ప్రయాణించిన పవన్, లోకేష్
- మీరే కొనసాగాలని దివ్యాంగుల భావోద్వేగం
అమరావతి(చైతన్యరథం); మంచి జరగాలంటే మంచి వ్యక్తు లు, మంచి పార్టీ అధికారంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కార్యక్ర మాలు, చేస్తున్న అభివృద్ధి గురించి దివ్యాంగులు ప్రజలకు తెలి యజేయాలని, మరింత చైతన్యం తీసుకురావాలని కోరారు. దివ్యాంగ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో కలిసి మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకూ ప్రయాణించారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు ఉచిత టికెట్ను సీఎం అందించారు. ఈ సందర్భంగా వారితో కాసేపు సంభాషిం చారు. వారి కష్ట సుఖాలు… కుటుంబ నేపథ్యం వంటివి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో సీఎం మాట్లాడుతూ రూ.500 ఉండే పింఛను 2014లో తాను అధికారంలోకి వచ్చాక రూ.1500 చేశా.. ఆ తర్వాత రూ.3000లకు పెంచామ ని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఒకేసారి రూ.6000కు పెంచాం. గతంలో దివ్యాంగులకు చేయూత కార్యక్ర మం ద్వారా పరికరాలు అందించాం..మీలో మనోధైర్యం రావాలనే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
దివ్యాంగ శక్తి పథకంతో ఆర్థికంగా ఉపయోగం
దివ్యాంగులకు చేయూతనిస్తే సమాజంలో అందరితో సమానం గా ముందుకు వెళతారు. ‘సంక్షేమ పథకాలు అర్హులందరికీ ఇస్తున్నాం. అందులో దివ్యాంగులకూ కొంత ఎక్కువగా ఇస్తున్నా మంటే.. మీలో ఆత్మ విశ్వాసం కలిగించడం కోసమే. దివ్యాంగుల పెన్షన్ను 12 ఏళ్లలో 12 రెట్లు పెంచాను. దివ్యాంగ శక్తి పథకం మీకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. మీలో మనోధైర్యం రావాలి అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ ఛార్జీల రూపంలో తమకు ఖర్చు అయ్యే రూ.1500 వరకూ తమకు మిగులుబాటు అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
దివ్యాంగుల భావోద్వేగం
తమకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న మేలుపై సీఎంతో పలువురు దివ్యాంగులు పంచుకున్నారు. మంగళ గిరికి చెందిన ఓ దివ్యాంగుడు మాట్లాడుతూ తనకు కీళ్లవాతం రావడంతో వెన్నుపూస దెబ్బతిందని.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3 లక్షలు అందించడంతో ఆపరేషన్ విజయవంతంగా చేయించుకున్నానని తెలిపారు.
మరో దివ్యాంగుడు మాట్లాడుతూ తమ దంపతులిద్దరికీ దివ్యాంగుల పింఛను వస్తోందని, గతంలో వేరే ఊరు వెళ్లాలంటే బస్ ఛార్జీలకు రూ.1500 వరకూ ఖర్చయ్యే దని, ఇప్పుడు అవి మిగులుతున్నాయని తెలిపారు. స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారని, క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తున్నారని మరో దివ్యాంగుడు వివరించారు.
మా కోసం మీరు చేస్తున్న సాయానికి మాటలు రావడం లేదు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉండాలని దివ్యాంగులు ఆకాంక్షించారు.















