- దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేవి విద్య, క్రీడలే
- యువత వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- తీర ప్రాంతానికి ఏమి చేయడానికైనా సిద్ధం
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్ ప్రారంభం
నరసాపురం(చైతన్యరథం నరసాపురం మండలం పెదమైన వాని లంక గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో యూనియన్ బ్యాంకు వారి సహకారంతో రూ.18 లక్షలు విలువచేసే కంప్యూటర్లు, సైన్సు ల్యాబ్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులకు అంకితం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖామంత్రితో పాటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పి.వి.యన్.మాధవ్, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని, విద్యార్థు లతో మమేకమై వారితో కొద్దిసేపు నిర్మలా సీతారామన్ ముచ్చ టించారు.. కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. డిజిటల్ క్లాసులు ద్వారా ప్రపంచలో జరుగుచున్నవాటిని, ఉన్నత విద్యా ప్రమాణాలు చక్కగా తెలుసుకోవచ్చునని, ప్రతి విద్యార్థి హాజరు అయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సాదించాలని సూచించా రు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తీరప్రాంత యువత ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించా లని అన్నారు. తీర ప్రాంతానికి ఏమి కావాలన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నామని, అభివృద్ధి, సంక్షేమం తాము చూసుకుంటా మని తెలిపారు. చదువుతోపాటు క్రీడలపైన ప్రత్యేక దృష్టి పెట్టాల ని, ప్రపంచ స్థాయిలో మన భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేది విద్య, క్రీడలు.. విద్యార్థులు మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీవో దాసి రాజు, డీఎస్పీ జి.శ్రీవేద, యూనియన్ బ్యాంకు యంచి ఆశీస్ పాండే, ఎస్ఎల్బీసీ సి.వి.యన్.భాస్కర్, రీజనల్ హెడ్ మన్యం, ఏజీఎం శ్రీనివాసు, ఎల్డీఎం ఏ. నాగేంద్రప్రసాదు, జిల్లా విద్యాశాఖ అధికా రి ఇ. నారాయణ, నరసాపురం టీడీపీ ఇన్చార్జి పొత్తూరి రామ రాజు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అయినంపూడి శ్రీదేవి. కేంద్రమంత్రి ప్రతినిధి పేరాల మోహన్, బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచి కొల్లాటి కనకదుర్గ, హెచ్ఎం యం.డి. ఇబ్రహీం, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ సి. హెచ్ నరసిం హస్వామి, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు..

















