అమరావతి(చైతన్యరథం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతా రామన్ తో సీఎం చంద్రబాబు ఆదివారం మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం చంద్రబాబు పెద్దపుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు నివాసానికి వెళ్లారు.















