- ఐదు అంశాలతో సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
- గిరిజనుల ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పిస్తాం
- వారి కోసం రూ.4764 కోట్లు కేటాయించాం
- మన సంకల్పమే మనకు ఆత్మవిశ్వాసం
- ప్రతి పౌరుడికీ ఒక ఒక సంకల్పం ఉండాలి
- దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యమే కీలకం
- సమాజ హితులే గొప్ప దేశ భక్తులు
- స్వర్ణాంధ్ర కోసం మనమంతా కలిసి పనిచేద్దాం
- పనిచేసే ప్రతి వ్యక్తీ సమాజానికి ఓ మంచి ఆస్తి
- అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): దేశానికి, రాష్ట్రానికి విజన్ ఉన్నట్టే ప్రతీ పౌరుడికి ఓ విజన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశం, రాష్ట్రం, గ్రామం, కుటుంబం అభివృద్ధి కోసం అంతా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. 2047 స్వర్ణాంధ్ర కోసం తాను సంకల్పం తీసుకున్నానని వివరించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయ వాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ నృత్యం థింసా, డప్పు, వివిధ వాయిద్యాలతో గిరిజన మహిళలు, మంత్రి సంధ్యారాణి, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. థింసా నృత్యం చేస్తున్న మహిళలతో ఆయన కూడా అడుగులు వేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ సంస్కృతీ సంప్రదా యా లను కాపాడుకుంటూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. అవకా శాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్ధ్యం ఆదివాసీలకు ఉంది. ఓ సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ము ఒడిశాలో మంత్రిగా, గవర్నర్గా పనిచేసి నేడు రాష్ట్రపతిగా అత్యున్నత స్థానం లో ఉన్నారని వివరించారు.
ప్రతిఒక్కరూ ఒక సంకల్పం తీసుకోవాలి
మన సంకల్పమే మనకు ఆత్మవిశ్వాసం కల్పించి అందలాలు ఎక్కిస్తుంది. అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, ప్రధాని మోదీ ఇలా ప్రతి ఒక్కరూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారే. సంకల్పం ఒక్కటే మార్పు తెస్తుందని అంతా గుర్తించాలి. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా అంతా సంకల్పం తీసుకోవాలి. నేను, నా దేశం, నా రాష్ట్రం, నా ఊరు, నా కుటుంబం అనే భావనతో సంక ల్పం చేస్తేనే
అభివృద్ధి సాధించగలం. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజానికి, దేశానికి నేను ఏమివ్వాలనే లక్ష్యం తో పనిచేద్దాం. గిరిజన రైతులు తన పంటను మెరుగ్గా పండించి దేశం కోసం కృషిచేశారు. స్వయం ఉపాధితో సంపాదిస్తున్న మహిళ దేశం కోసం పనిచేసినట్టే. ఓ విద్యార్థి, ఓ ఉద్యోగి, ఓ వ్యాపారి, ఓ కూలి ఇలా ఎవరైనా నిష్టతో అత్యుత్తమ సామర్థ్యంతో పనిచేస్తే దేశ కోసం
పనిచేసినట్టే. సమాజానికి ఏమిచ్చాం, దేశా నికి ఏం చేశాం అన్నదే లక్ష్యంగా పనిచేయాలి. ఒకరు ప్రకృతి కోసం, మరొకరు పర్యావరణం కోసం, ఇంకొకరు నీటి సంరక్షణ కోసం పనిచేయాలి. రాష్ట్రానికి, దేశానికి విజన్ ఉన్నట్టే వ్యక్తిగతం గానూ ప్రతిఒక్కరికీ ఓ విజన్ ఉండాలి. వికసిత్ భారత్ విజనన్ను ప్రధాని మోదీ చేస్తే.. నేను 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పన చేశాను. జాతీయ జెండా స్ఫూర్తితో కలసికట్టుగా ముందుకు అడు గేద్దాం. వ్యక్తిగతంగా విజయం సాధించటమూ నేషన్ బిల్డింగ్లో భాగమే. పనిచేసే ప్రతి వ్యక్తీ సమాజానికి ఆస్తి. సమాజం కోసం పనిచేయటమే గొప్ప దేశభక్తి, అందరి గెలుపే దేశం గెలుపు అని స్పష్టం చేశారు.
అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్గా మారుస్తాం
భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాం. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిరిజన బిడ్డలు థింసా నృత్యం ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. ఈ రికార్డు సాధించి మన సంస్కృతీ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. పోడు వ్యవసాయం కాదు ఆర్గానిక్ వ్యవసాయంతో గిరిజనులు విలువైన పంటలను ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని 27.39 లక్షల మంది గిరిజనుల సమగ్రాభివృద్ధికి రూ.4764 కోట్లను కేటా యించాం. ఐటీడీఏలతో గిరిజన అభివృద్ధి కోసం జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రత్యేకంగా దృష్టి సారించాం. మౌలిక వసతుల కల్పన, ఉపాధి, ఉద్యోగాలు, నైపుణ్య కల్పనపై ప్రత్యేకం గా శ్రద్ధ పెట్టాం. 2336 గిరిజన ఆవాసాలకు మిషన్ మోడ్లో రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నాం. 2027 నాటికి ప్రతీ గిరిజన కుటుంబానికీ సురక్షితమైన తాగునీరు, ఆవాసం కల్పిస్తాం, సోలార్ రూఫ్ టాప్ కూడా ఏర్పాటు చేస్తాం. అడవి తల్లి బాట పేరుతో వెయ్యి
కోట్లతో 905 కిలోమీటర్ల రోడ్లు వేశాం. డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్సులు, 108,104 మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేశాం.
అలాగే డిజిటల్ కనెక్టివిటీ కోసం సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నాం. 25 ఏళ్ల క్రితమే అరకు కాఫీకి నాంది పలికాం, ఇప్పు డు ప్రపంచ బ్రాండ్గా అరకు కాఫీ ఎదిగింది. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం. కాఫీ, మిరియాలు, పసుపు లాంటి వాణిజ్య పంటలకు బ్రాండ్గా ఏజెన్సీ ప్రాంతం మారాలి. ప్రధాని మోదీ కూడా ఆస్ట్రేలియా ప్రధానికి అరకు కాఫీనే బహు మతిగా ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతీ అతిథికి అరకు కాఫీని బహుమతిగా ఇస్తూ ప్రోత్సాహం కల్పిస్తున్నాం. పార్లమెంటులోనూ అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు
చేయించాం. బెస్ట్ గ్లోబల్ బ్రాండ్గా దీనిని మారుస్తాం. గిరిజన ప్రాంతాల్లోని అటవీ ఉత్పత్తులకు విలువ జోడించటం ద్వారా మంచి మార్కెటింగ్ కల్పి స్తాం. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనా పిల్, తేనె, తాటి బెల్లం ఇలా ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, బ్రాండింగ్ వరకూ ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు.
ఆదివాసీల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ
రహదారులు, సురక్షితమైన తాగునీరు లాంటి మౌలికవసతులు, విద్య, వైద్యంవైద్యం, ఆదాయ వనరుల పెంపు, నైపుణ్య శిక్షణ లాంటి ఐదు అంశాల్లో ఆదివాసీల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తు న్నాం. ఒక్క ఆదివాసీల కోసమే మూడు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసి వారికి ప్రాధాన్యత కల్పించాం. ఎటు చూసినా పచ్చదనం కలిగిన ఈ ప్రాంతాల్లో పర్యాటకాన్ని కూడా గణనీయంగా ప్రోత్స హిస్తాం. నేడు చేసుకున్న 19 ఎంవోయూల ద్వారా 60 వేల మందికి లబ్ధి కలుగుతుంది. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా 1.5 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అంది స్తాం. ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షలకు కూడా వారిని సిద్ధం చేసి అందరితో పోటీ పడేలా ప్రోత్సహిస్తాం. జీవో 3 ద్వారా గిరిజ న ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేశాం. గత పాలకు ల నిర్లక్ష్యం కారణంగా ఈ జీవోను కొట్టివేశారు. ప్రత్యామ్నాయం గురించి ఆలోచన చేస్తున్నాం. ఆదివాసీల హక్కులు కాపాడేం దుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. నాణ్యమైన వైద్య సేవలు అందేలా రూ.250కోట్లతో పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, చింతూరు, కేఆర్ పురం, శ్రీశైలం లాంటి ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.
స్వర్ణాంధ్ర కోసం కలిసి పనిచేద్దాం
2047 నాటికి స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధన కోసం మనం అంతా పనిచేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా ప్రణాళికలు చేశాం. సూపర్ సిక్స్ పాటు వివిధ ప్రభుత్వశాఖల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. పీ4తో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా పేదలను ఆదు కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలు ఎలా అందుతున్నా యో తెలుసుకునేందుకు ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం. ప్రజల జీవితాలను మార్చి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తే తన లక్ష్యం నెరవేరినట్టే. దేశం, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతీ పౌరుడూ భాగస్వామి కావాలి. విద్యార్థులకు ఇది అలవాటు చేసేలా ఓ మొక్కను నాటి సంరక్షించేలా గ్రీన్ పాస్పోర్టు కార్యక్రమం తెచ్చాం. మన పర్యా వరణం కోసం మొక్కలు నాటటంతోపాటు వాటిని సంరక్షించటం కూడా మన బాధ్యత. 80 స్వతంత్ర దినోత్సవం లోగా ప్రతి పౌరుడూ ఓ సంకల్పం తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే 21 ఏళ్లలో దేశం, రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారాలని ఆకాంక్షించారు. అనంతరం అంబేద్కర్ కళావేదిక వద్ద ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సీఎం పరిశీలించారు. పాడేరు, రంపచోడవరం, నల్లమల, అరకు, చింతపల్లి, పార్వతీపురం మన్యం తదితర ప్రాంతాల నుంచి ఉత్పత్తులు తయారు చేసి ప్రద ర్శించిన గిరిజన మహిళలను అభినందించారు. గిరిజన ప్రాంతా ల్లో తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండ్ రూపొందించి మార్కె టింగ్ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం వివిధ ప్రైవేటు సంస్థలతో సీఎం సమక్షంలో గిరిజన సంక్షేమశాఖ, ఐటీడీఏలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.












