- పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకావిష్కరణ
అమరావతి(చైతన్యరథం) అలనాటి మేటినటి, దివంగత కృష్ణవేణి జీవిత చరిత్ర ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఆ తరం సటీమణి, గాయని స్టూడియో అధినేత అయిన కృష్ణవేణి జీవితం ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుందని, ఈ పుస్తక ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పుస్తకావిష్కరణలో కృష్ణవేణి కుమార్తె అనురాధాదేవి, నంద మూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్, నిర్మాతలు దీవీకే రాజు, ఉమామహేశ్వర రావు, పర్వత నేని రాంబాబు, కాకాణి బ్రహ్మం, కొత్తపల్లి శ్రీధర్, యువ హీరో అభిరామ్, గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొ న్నారు. తన పుస్తకం సీఎం చంద్రబాబు ఆవిష్కరించడం మర్చిపోలేని అనుభవమని రచయిత సంతోషం వ్యక్తం చేశారు.













