- టెక్నాలజీ డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ ఇయర్గా 2026
- అవసరమైతే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి పర్యవేక్షించాలి
- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సమర్థత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలని.. తద్వారా ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. సాంకేతికతతో గవర్నెన్స్ లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికత ను ఉద్యోగులు, అధికారులు విస్తృతస్థాయిలో వినియో గించుకునేలా ప్రోత్సహించేలా కోరారు. 2026 సంవ త్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్ మారాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. ఏఐ వినియోగించుకుని గ్రీవెన్సులు సత్వరంగా పరిష్కరించాలని నిర్దేశించారు. క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్పై వివిధ శాఖల అధికారు లతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… ఇక డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై మరింత దృష్టి సారిస్తామని -చెప్పారు. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందించగలుగు తున్నట్టు… ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహ దారులు, ఆర్టీఏ,అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు.















