- ప్రకృతి సాగు చేద్దాం..భూమిని బాగు చేద్దాం
- సేంద్రీయ సాగుతో ప్రజారోగ్యం-పర్యావరణానికి మేలు
- గ్లోబల్ మార్కెట్కు అనుగుణంగా సేద్యంతో ఉత్పత్తులు
- ప్రకృతి వ్యవసాయంతో ఆర్థికాభివృద్ధి సాధ్యమే
- రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు
- ప్రపంచ ఆర్థిక సదస్సులో రౌండ్ టేబుల్ సమావేశం
దావోస్(స్విట్జర్లాండ్): ప్రకృతి సాగు చేయాలని.. భూమిని బాగు చేసేలా వ్యవసాయం, ఆహార ఉత్పత్తులను పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తు లపై హైలెవల్ మీటింగ్… అలాగే రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ప్రకృతి సేద్యానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే గ్లోబల్ మార్కెట్లో నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్కు ఉన్న డిమాండ్కు తగ్గట్టు రాష్ట్రం ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రపంచం లోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసేందుకు పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉంది. ప్రకృతి సేద్యం అనేది కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాదు, వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక శక్తివంతమైన ఆయుధం. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ఎటువంటి ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రకృతి సేద్యానికి సంబంధించి ప్రపంచానికే ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధ చేస్తున్నాం. ఎరువుల వినియోగం.. రసాయనాల వినియోగంతో చేసే వ్యవసాయంతో పోలిస్తే, ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. రైతులకు మొదటి సంవత్సరం నుంచే అధిక నికర ఆదాయం లభిస్తోంది… రైతులు బలోపేతం కావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
పర్యావరణానికి మేలు చేసేలా..గ్లోబల్ మార్కెట్కు తగ్గట్టుగా సేద్యం
ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిలో కార్బన్ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది..అలాగే పర్యావరణానికి మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం తగ్గడంతో పాటు బయోడైవర్సిటీ పెరిగేలా చూసుకోవచ్చు. అలాగే భూసారం తగ్గకుండా భూమిని మరింత బలంగా పోషకాలు ఉండేలా చేసుకోవచ్చు. ఫార్మర్ టు ఫార్మర్ అనే పద్దతిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రకృతి సేద్యంలో అనుభవజ్ఞులైన రైతులు ఇతర రైతులకు శిక్షణ ఇచ్చేలా వ్యవస్థను రూపొందించాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ల లో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి వీలుగా సరైన మార్కెటింగ్ వ్యవస్థను, సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవం తం చేస్తోంది. టెక్నాలజీని ఉపయోగించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని, పర్యావరణాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను సిద్దం చేస్తోంది. అయితే ప్రకృతి సాగును ప్రొత్సహించేందుకు మెరుగైన పారిశ్రామిక పద్దతులు, ఆర్థిక ప్రొత్సాహకాలు అవసరం. వ్యాపార సంస్థలు తమ ఆర్థిక లాభాల పరంగానే కాకుండా పర్యావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ను అంచనా వేసుకుంటూ అంతర్జాతీయంగా రాష్ట్ర ఉత్పత్తులను ఎగుమతులు చేసేలా భారీ ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఓ పెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా నిరూపించే దిశగా ఏపీలోని రైతులను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.















