అహర్నిశలు ప్రజలకోసం శ్రమించే స్వర్ణాంధ్ర సారథి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు బడుగుల బాగోగులను తెలుసుకునేందుకు చేపట్టిన మీకోసం ప్రజా చైతన్యయాత్ర ఆగస్టు 15 నాటికి సరిగ్గా 117 రోజులు పూర్తిచేసుకుంది.“మీలో నేనూ ఒకడినంటూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్ర్రంలోని 23 జిల్లాలు, 150 నియోజకవర్గాలు, 425 మండాలాలు, 2048 ప్రాంతాల్లో పర్యటించి 3239 చోట్ల ప్రజా చైతన్య ప్రసంగాలు చేశారు. అంతేకాకుండా భారతదేశ చరిత్రలో ప్రజాసమస్యల అధ్యయనానికి ఏ రాజకీయ నాయకుడు స్పందించని రీతిలో స్పందించి నభూతో నభవిష్యతి అన్న రీతిలో సుధీర్ఘంగా రాష్ట్ర్రమంతటా 10339 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఈ యాత్రను పురస్కరించుకొని ఆగస్టు 15 తేదీన తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభను తలపెట్టింది.ఈసందర్భంగా స్వాతంత్ర్యోద్యమ స్పూర్తితో ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.అస్పూర్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ పునరంకిత సభ విశేషాలను ప్రత్యక్ష ప్రసారంతో మీముందుంచుతున్నాం. |